ETV Bharat / jagte-raho

లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు

author img

By

Published : Jun 7, 2020, 12:29 PM IST

సింగరేణి కార్మికులతో వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

bus accident at rangarao banjara in khammam district
లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావుబంజర వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.

కొత్తగూడెం నుంచి సత్తుపల్లి బొగ్గు ఉపరితల గనిలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులను తీసుకొస్తున్న సింగరేణి బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో గాయపడిన వారిని సింగరేణి సంస్థ అంబులెన్స్​లో కొత్తగూడెం సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావుబంజర వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.

కొత్తగూడెం నుంచి సత్తుపల్లి బొగ్గు ఉపరితల గనిలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులను తీసుకొస్తున్న సింగరేణి బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో గాయపడిన వారిని సింగరేణి సంస్థ అంబులెన్స్​లో కొత్తగూడెం సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: మొహంపై బండరాళ్లతో మోది హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.